
పాముకాటుతో..
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): నాగిరెడ్డిపేట మండలంలోని వాడి గ్రామానికి చెందిన బాల్లింగం కిష్టయ్య(67) అనే వ్యక్తి పాముకాటుతో మృతిచెందాడు. కిష్టయ్య గురువారంరాత్రి భోజనంచేసి తన ఇంట్లో నిద్రించాడు. శుక్రవారం వేకువజామున నాలుగు గంటలప్రాంతంలో తనను పాము కరిచిందని భార్య సిద్ధవ్వకు తెలిపాడు. వెంటనే ఆమె కుమారులతో కలిసి కిష్టయ్యను మెదక్ ఆస్పత్రికి తరలించింది. అక్కడ ప్రాథమిక చికిత్స చేసిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించాలని సూచించారు. హైదరాబాద్కు తరలిస్తుండగా మార్గమధ్యంలో కిష్టయ్య మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.