నిజామాబాద్‌ | - | Sakshi
Sakshi News home page

నిజామాబాద్‌

Jun 13 2025 4:43 AM | Updated on Jun 13 2025 4:43 AM

నిజామ

నిజామాబాద్‌

శుక్రవారం శ్రీ 13 శ్రీ జూన్‌ శ్రీ 2025

– 8లో u

నగరంలోని ఓ హోటల్‌ వద్ద ఆటో డ్రైవర్‌ను ఓ రౌడీషీటర్‌తోపాటు అనుచరులు బెదిరింపులకు పాల్పడ్డారు. కాగా, దాడి చేసిన వ్యక్తులపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు బాధితుడు భయపడ్డాడు. దీంతో సీపీ ఆదేశాల మేరకు పోలీసులు ఎంట్రీ ఇచ్చి సదరు రౌడీషీటర్‌తోపాటు అనుచరులపై కేసులు నమోదు చేశారు.

జిల్లా కేంద్రంలో కొన్ని ప్రాంతాలు రౌడీ షీటర్లకు అడ్డాగా మారాయి. అమాయక ప్రజలను బెదిరించడం, దాడులు చేసిన ఘటనలు ఉన్నాయి. గ్యాంగ్‌ల మధ్య పోటీ పెరిగి ఇరువర్గాలు కత్తులు దూసుకోవడం, ఒకరినొకరు చంపుకోవడం మామూలుగా మారింది. రౌడీ షీటర్లపై సీపీ పోతరాజు సాయి చైతన్య దృష్టి సారించారు. వారు తీరుమార్చుకుంటే రౌడీషీట్‌ తొలగిస్తామ ని, లేకుంటే పీడీయాక్ట్‌ ప్రయోగిస్తామని హెచ్చరిస్తున్నారు.

ఖలీల్‌వాడి : జిల్లాలోని రౌడీషీటర్ల ఆగడాలపై పోలీస్‌ బాస్‌ నిఘా పెంచారు. రౌడీలుగా చలామణి అవుతున్న వారి కార్యకలాపాలపై నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ పోతరాజు సాయిచైతన్య ప్రత్యేక దృష్టి సారించారు. తమకు తాముగా మారితే రౌడీషీట్‌ తొలగిస్తామని, లేకుంటే పీడీయాక్ట్‌ ప్రయోగిస్తామని హెచ్చరిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 355 మంది రౌడీషీటర్లు ఉండగా, అందులో 240 మంది వరకు నగరంలోనే ఉన్నారు. ఇల్లీగల్‌ దందాను అడ్డుపెట్టుకొని రౌడీషీటర్లు అమాయక ప్రజలను బెదిరించడం, దాడులు చేసిన ఘటనలు ఉన్నాయి. గతంలో రౌడీషీటర్ల మధ్య ఆధిపత్య పోరుతో ఇబ్రహీం ఛావూస్‌ అలియాస్‌ జంగిల్‌ ఇబ్బు, ఆరిఫ్‌డాన్‌ హత్యకు గురైన విషయం తెలిసిందే. దీంతో రౌడీ షీటర్ల ఆటకట్టించేందుకు సీపీ ప్రత్యేకంగా సీసీఎస్‌, టాస్క్‌ఫోర్స్‌ పోలీసులను రంగంలోకి దించారు. ఆయా పోలీస్‌స్టేషన్‌ల పరిధిలోని నిఘా వర్గాల ద్వారా రౌడీషీటర్లు చేస్తున్న పనులపై ఆరా తీస్తున్నారు.

ప్రత్యేక బృందాలు ఏర్పాటు..

రౌడీ షీటర్ల ఆటకట్టించేందుకు సీపీ సాయి చైతన్య ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. అక్రమ దందాలు నిర్వహించే, రౌడీ షీటర్ల ప్రభావం ఉండే ప్రాంతాలపై దృష్టి సారించి సామాన్యులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. అమాయక ప్రజలపై బెదిరింపులు, దాడులకు పాల్పడితే శిక్షలు కఠినంగా ఉంటాయని ఇప్పటికే పలువురు రౌడీ షీటర్లకు హెచ్చరికలు పంపారు. రౌడీ షీటర్లు ఎవరినైనా బెదిరించినా, భయపెట్టినా స్థానిక పోలీసులకు లేదా డ యల్‌ 100కు సమాచారం అందించాలని పోలీసు లు సూచిస్తున్నారు.

న్యూస్‌రీల్‌

ఆ ప్రాంతాల్లోనే అక్రమ దందాలు

నగరంలోని మాలపల్లి, ఆటోనగర్‌, సారంగా పూర్‌, నెహ్రూనగర్‌, బాబాన్‌సాహెబ్‌ పహాడ్‌, బోధన్‌ రోడ్డు, నాగారం ప్రాంతంలో అక్రమ దందా జోరుగా సాగుతోంది. ఇక్కడ బిహార్‌, పశ్చిమబెంగాల్‌, మహారాష్ట్ర తదితర ప్రాంతా లకు చెందినవారు ఎక్కువగా ఉంటారు. గంజా యి, మట్కా, భూ మాఫియా, మామూళ్ల వసూ ళ్ల ఎక్కువగా జరుగుతాయి. వ్యాపారంలో పోటీ పెరగడంతో ఇరువర్గాల మధ్య కత్తులతో దాడు లు కొనసాగుతున్నాయి. రౌడీషీటర్లు ఎక్కువగా ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి వాటిని రూ.70 వేల నుంచి రూ. 2 లక్షల వరకు అమ్మకాలు సాగిస్తున్నారు. ప్లాట్లు కొనుగోలు చేసి అందు బాటులో లేని వారి స్థలాలను ఆక్రమించి ఇతరులకు విక్రయించేస్తున్నారు.

దీంతో అసలు యజమానులు వచ్చేసరికి ఇంటి స్థలంలో నిర్మాణాలు కనిపిస్తున్నాయి. ఇదేమిటని ప్రశ్నిస్తే రౌడీషీటర్ల అనుచరులు దాడులు చేయడంతోపాటు కత్తులు చూపించి బెదిరింపులకు పాల్పడిన ఘటనలూ ఉన్నాయి. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు జంకే పరిస్థితి ఏర్పడింది.

నగరంలో 240 మంది, ఇతర

ప్రాంతాల్లో 115 మందిపై రౌడీ షీట్‌

అక్రమ దందాల అడ్డుకట్టకు

సీపీ పోతరాజు సాయిచైతన్య దృష్టి

రంగంలోకి సీసీఎస్‌,

టాస్క్‌ఫోర్స్‌ బృందాలు

అమాయకులను బెదిరిస్తే శిక్షలు కఠినంగా ఉంటాయని హెచ్చరికలు

నిజామాబాద్‌1
1/2

నిజామాబాద్‌

నిజామాబాద్‌2
2/2

నిజామాబాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement