
ఇఫ్కో ద్వారా నాణ్యమైన ఎరువులు
మోర్తాడ్: ఇఫ్కో ద్వారా రైతులకు నాణ్యమైన ఎరువులు అందుబాటులో ఉంటున్నాయని ఆ సంస్థ జాతీయ డైరెక్టర్, మార్క్ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి అన్నారు. మోర్తాడ్లో గురువారం ఇఫ్కో బజార్ను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సంస్థ తెలంగాణ సేల్స్ మేనేజర్ కృపా శంకర్, తెలుగు రాష్ట్రాల రీజినల్ మేనేజర్ పొన్నం రాజు, డీసీసీబీ డైరెక్టర్ మోత్కు భూమన్న, సంస్థ ఫీల్డు మేనేజర్ శివరామకృష్ణ, మోర్తాడ్, కమ్మర్పల్లి సహకార సంఘాల చైర్మన్లు బద్దం అశోక్, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.