టీడీపీ కథ ముగిసినట్లే..! | - | Sakshi
Sakshi News home page

టీడీపీ కథ ముగిసినట్లే..!

Nov 6 2023 12:30 AM | Updated on Nov 6 2023 8:17 AM

- - Sakshi

నిజామాబాద్: తెలంగాణ ఆవిర్భావానికి ముందు జిల్లాలో ఒక వెలుగు వెలిగిన టీడీపీ మారుతున్న రాజకీయ పరిణామాలతో కనుమరుగైపోతోంది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో పోటీకి దూరంగా ఉండాలని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకోవడం, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ పదవికి రాజీనామ చేసి బీఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. పార్టీ కీలక నేత రాజీనామా చేయడంతో టీడీపీ కనుమరుగయ్యే పరిస్థితి కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేయాలని కింది స్థాయి నాయకులు ఆశించారు.

బీజేపీ పొత్తుతో..
2014లో బీజేపీతో పొత్తుతో టీడీపీ అభ్యర్థులు జిల్లాలోని వివిధ స్థానాల్లో పోటీ చేశారు. కానీ ఎక్కడా టీడీపీ, బీజేపీ అభ్యర్థులు విజయం సాధించలేదు. 2009 ఎన్నికల్లో మాత్రం ఆర్మూర్‌, జుక్కల్‌, బాన్సువాడ, కామారెడ్డి స్థానాల్లో టీడీపీ పట్టు సాధించింది. 2014లో పార్టీ ప్రభావం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. 2018లో పోటీకి అభ్యర్థులు ఎవరూ ముందుకు రాకపోవడంతో టీడీపీ బరిలో నిలువలేదు.

ఈ ఎన్నికల్లో ఆర్మూర్‌, నిజామాబాద్‌ అర్బన్‌ స్థానాల్లో పోటీకి ఇద్దరు నాయకులు ఆసక్తి చూపినా పోటీకి పార్టీ అధినేత చంద్రబాబు అంగీకరించకపోవడంతో మరోసారి గుర్తు కనిపించే అవకాశం లేకుండా పోయింది. ఎన్నికల్లో పోటీకి పార్టీ దూరం కావడంతో నాయకులు అంతా ఉత్సవ విగ్రహాలుగా ఉండిపోయారనే వాదన వినిపిస్తోంది. ఏది ఏమైనా తెలంగాణ ఏర్పడక ముందు భారీ విజయాలను నమోదు చేసుకున్న టీడీపీ కథ ఇక జిల్లాలో ముగిసినట్లే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement