నిర్మల్చైన్గేట్: నిర్మల్ నూతన కలెక్టర్గా భవేశ్ మిశ్రా ఆదివారం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. మధ్యాహ్నం జిల్లా కేంద్రానికి చేరుకున్న భవేశ్మిశ్రాకు అభిలాష అభినవ్, అదనపు కలెక్టర్లు బి.వెంకటేశ్వర్లు, కిశోర్కుమార్, వివిధ శాఖల అధికారులు పూలమొక్కలు అందించి స్వాగతం పలికారు. అనంతరం తన చాంబర్కు వెళ్లి బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమంలో ఆర్డీవో రత్నకళ్యాణి, జిల్లా అధికారులు జీవరత్నం, డీఎంహెచ్వో డాక్టర్ రాజేందర్, శ్రీనివాస్, నరసింహారెడ్డి, దయానంద్, డీఈవో భోజన్న, సుధాకర్, డీఆర్డీవో విజయలక్ష్మి, రమణ, డీవైఎస్వో శ్రీకాంత్రెడ్డి, శ్రీనివాస్, అధికారులు పాల్గొన్నారు.


