మండు వేసవిలో నిండుకుండ
జిల్లాలో భానుడు భగ్గుమంటున్నాడు. ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలకుపైగా నమోదవుతున్నాయి. వేడికి చెరువులు, కుంటల్లో నీరు అడుగంటుతోంది. బావులు, బోర్లు ఎండిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితిలో కూడా లక్ష్మణ చాంద మండలంలోని కనకాపూర్ వాగు నిండుకుండను తలపిస్తోంది. సరస్వతీ కాలువ ప్రవహిస్తుండడంతో ఆ నీళ్లు వాగులో చేరి చుట్టుపక్కల ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెంచింది. దీంతో పశుపక్ష్యాదులకు తాగునీటి కష్టాలు తప్పాయి. – లక్ష్మణచాంద


