లక్ష్మణచాంద: వేసవి సెలవులు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. 2025–26 విద్యా సంవత్సరం ముగిసింది. దాదాపు రెండు నెలలు పాఠశాలలు తెరుచుకోవు. ఈ నేపథ్యంలో గతంలో వేసవి సెలవుల్లో ప్రభుత్వ పాఠశాలలకు చెందిన ఆస్తులు చోరీ అయ్యాయి. ఆకతాయిలు ధ్వంసం చేశారు. దీంతో సెలవుల్లో పాఠశాలల ఆస్తుల సంరక్షణ ప్రధాన సమస్యగా మారింది. సెలవుల్లో గుర్తుతెలియని వ్యక్తులు వెళ్లి కిటికీలు, తాళాలు, తలుపులు ధ్వంసం చేఉసిన సంఘటనలు ఉన్నాయి. ఈసారి పాఠశాలల ఆస్తుల రక్షణకు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ సంచాలకులు నవీన్ నికోలస్ ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేశారు.
పీఎంశ్రీ పాఠశాలల్లో సీసీ కెమెరాలు..
జిల్లాలోని పీఎంశ్రీ పాఠశాలల ఆవరణలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వీటికి ప్రధానోపాధ్యాయుడితోపాటు, పీడీ, ఒక సీనియర్ ఉపాధ్యాయుడికి అనుసంధానం చేశారు. దీంతో నిరంతరం వాటిని చూస్తుడంటతో పాఠశాలలకు ఎవరు వస్తున్నారు అనేది ఇట్టే తెలిపోతుందని ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు అంటున్నారు.
మార్గదర్శకాలు ఇవే...
భధ్రపరచాల్సిన వస్తువులు ఇవే...
లక్ష్మణచాంద పాఠశాలలో సీసీ కెమెరా
జిల్లా సమాచారం....
ప్రాథమిక పాఠశాలలు 577
ప్రాథమికోన్నత పాఠశాలలు 89
ఉన్నత పాఠశాలలు 164
కేజీబీవీలు 18
పోషకులు దృష్టి సారించాలి...
ప్రభుత్వ పాఠశాలల ఆస్తుల రక్షణ కోసం ఆయా పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల పోషకులు కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. తమ గ్రామాల్లోని పాఠశాలల ఆస్తుల రక్షణ గ్రామ యువత, పోషకులు తమ బాధ్యతగా భావిస్తే ఎటువంటి నష్టం జరగకుండా ఉంటుంది. వేసవి సెలవుల సమయంలో తాత్కాలిక పద్ధతిన రాత్రి సమయంలో కాపాలదారులు నియమించాలని పలువురు కోరుతున్నారు. అయితే ప్రభుత్వం నుంచి తాత్కాలిక పద్దతిలో నియమించుకోవాలని ఎటువంటి ఆదేశాలు రాలేవని అధికారులు అంటున్నారు.


