లింగాపూర్: రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్రగాయాలైన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. సిర్పూర్(యు) మండలంలోని రుద్రకాసకు చెందిన ఆత్రం భీంరావ్, లక్ష్మణ్, శంకర్ శనివారం ద్విచక్ర వాహనంపై ఆసిఫాబాద్ నుంచి స్వగ్రామానికి వస్తుండగా జైనూర్ మండలంలోని జామ్ని గ్రామ సమీపంలో అడవిపంది అడ్డురావడంతో అదుపుతప్పి కిందపడ్డారు. ముగ్గురికి తీవ్రగాయాలు కావడంతో గమనించిన స్థానికులు 108కు సమాచారం అందించారు. క్షతగాత్రులను జైనూర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పైలట్ కొమురయ్య, టెక్నీషియన్ రజనీకాంత్ తెలిపారు.


