వృథాను అరికడదాం | - | Sakshi
Sakshi News home page

వృథాను అరికడదాం

Mar 23 2026 9:08 AM | Updated on Mar 23 2026 9:08 AM

భైంసా: మార్చిలోనే ఎండలు దంచికొడుతున్నాయి. దీంతో భూగర్భ జలాలు అండుగంటుతున్నాయి. చెరువులు, బావుల్లో నీరు ఇంకుతోంది. ఈ నేపథ్యంలో కలెక్టర్‌ అభిలాష అభినవ్‌ తాగునీటి సమస్య రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. పల్లె ప్రగతి ప్రణాళికా కింద ప్రతి గ్రామంలో నీటి సరఫరా జరిగేలా పంచాయతీ కార్యదర్శులు, మండల అధికారులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. గతేడాది వేసవి కష్టాలు పునరావృతం కాకుండా రంగంలోకి దిగారు.

రంగుమారిన నీరు..

మిషన్‌ భగీరథ ద్వారా సరఫరా అయ్యే నీరు భైంసా మున్సిపాలిటీలోని వార్డులు, దిలావర్‌పూర్‌లో రంగుమారుతోంది. మున్సిపల్‌ చైర్మన్‌ తూమోల్ల దత్తాత్రి, కౌన్సిలర్లు పంప్‌ హౌస్‌లకు వెళ్లి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది, కానీ అధికారుల అప్రమత్తత లోపం గమనార్హం.

తగ్గుతున్న నీటిమట్టం..

జిల్లా వ్యాప్తంగా చెరువుల్లో నీటి మట్టం తగ్గుతోంది, భూగర్భజలాలు పడిపోతున్నాయి. రానున్న రోజుల్లో ఈ సమస్య తీవ్రతరంకాకుండా చూడాలి. చెరువుల్లో నీరు తగ్గితే మూగజీవాలకు నీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలి. ఇక మిషన్‌భగీరథ పైప్‌లైన్‌ లీకేజీలపై అధికారులు దృష్టిసారించాలి. ఈ వేసవిలో ఎక్కడ సమస్య వచ్చినా అప్రమత్తంగా ఉండాలి.

జిల్లా : నిర్మల్‌

నియోజకవర్గాలు : నిర్మల్‌, ముధోల్‌, ఖానాపూర్‌

మండలాలు : 18

గ్రామాలు : 400

ఆవాసాలు : 708

చేతి పంపులు : 2,167

బోరుబావులు, పంపుసెట్లు : 2,742

రక్షిత మంచి నీటి పథకాలు : 1,013

పైప్‌లైన్‌ల విస్తీర్ణం : 1970.2 కిలో మీటర్లు

నల్లా కనెక్షన్లు : 1,64,759

ఎత్తైన ప్రాంతాల్లో సమస్య..

ఎత్తుగా ఉన్న గ్రామ ప్రాంతాల్లో మిషన్‌ భగీరథ నీరు చేరడం లేదు, పల్లంలో ఉన్న గ్రామాలకు మాత్రమే పరిమితమవుతోంది. పంచాయతీ నేతలు సమస్యలు పరిష్కరించాలన్నా నిధుల లోపం అడ్డంకిగా నిలుస్తోంది. వేసవి ఊబిలో ఈ అభావం తీవ్ర సమస్యలకు దారి తీసే అవకాశం ఉంది. అధికారులు లీకేజీల సమీక్షలు, చెరువుల పునరుద్ధరణ, ట్యాంకర్ల సరఫరా ప్రణాళికలు రూపొందించాలి. ప్రజలు, పంచాయతీల సహకారంతో సమగ్ర పరిశీలనలు చేపట్టి వేసవి కష్టాలను తగ్గించవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement