రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ
ఖానాపూర్: జిల్లా కేంద్రంలో ఇటీవల తెలంగా ణ మ్యాథమెటిక్స్ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన గణిత ప్రతిభా పరీక్ష పోటీల్లో జిల్లాస్థాయిలో మొదటి స్థానంలో నిలిచిన మస్కాపూర్ పీఎంశ్రీ జెడ్పీహెచ్ఎస్ విద్యార్థి యశ్వంత్ రాష్ట్రస్థాయి పోటీల్లోనూ ప్రతిభ కనబరిచాడు. మంగళవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్లో నిర్వహించి న పోటీల్లో 396మంది పాల్గొనగా యశ్వంత్ నాలుగో ర్యాంక్ సాధించినట్లు హెచ్ఎం శ్రీని వాస్ తెలిపారు. యశ్వంత్కు మార్గనిర్దేశం చేసి న టీచర్లు శ్రీనివాస్, ఫరాజ్ను గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు అభినందించారు.


