బంద్‌ విజయవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

బంద్‌ విజయవంతం చేయాలి

Oct 12 2025 6:37 AM | Updated on Oct 12 2025 6:37 AM

బంద్‌ విజయవంతం చేయాలి

బంద్‌ విజయవంతం చేయాలి

నిర్మల్‌టౌన్‌: స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ఈనెల 14న తలపెట్టిన రాష్ట్రవ్యాప్త బంద్‌ విజయవంతం చేయాలని బీసీ సంఘాల నాయకులు కోరారు. నిర్మల్‌ ప్రెస్‌క్లబ్‌లో శనివారం మాట్లాడారు. అగ్ర కులాలు వారు ఓర్వలేక హైకోర్టులో కేసు వేసి రిజర్వేషన్లను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం బీసీలను నమ్మిస్తూ.. రాజకీయ డ్రామా చేస్తోందని మండిపడ్డారు. రాజకీయంగా బీసీలు ఎదగకుండా అడ్డుపడుతున్నారన్నారు. 42 శాతం రిజర్వేషన్‌ అమలు కాకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే.. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఇందులో బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు పొన్నం నారాయణగౌడ్‌, బీసీ సంఘం జాతీయ నాయకులు అప్క గజేందర్‌యాదవ్‌, నాయకులు అనుముల భాస్కర్‌, డాక్టర్‌ కత్తి కిరణ్‌, కిషన్‌, అశోక్‌నాయక్‌, ప్రశాంత్‌, శివాజీగౌడ్‌, నవీన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement