గర్భిణులు, బాలింతలకు మెరుగైన వైద్యం అందించాలి | - | Sakshi
Sakshi News home page

గర్భిణులు, బాలింతలకు మెరుగైన వైద్యం అందించాలి

Sep 17 2025 9:10 AM | Updated on Sep 17 2025 9:10 AM

గర్భిణులు, బాలింతలకు మెరుగైన వైద్యం అందించాలి

గర్భిణులు, బాలింతలకు మెరుగైన వైద్యం అందించాలి

● కలెక్టర్‌ అభిలాష అభినవ్‌ ● మాతాశిశు ఆస్పత్రి తనిఖీ ● అసౌకర్యాలపై ఆగ్రహం.. ● వసతులు మెరుగుపర్చాలని ఆదేశం

నిర్మల్‌ రూరల్‌: గర్భిణులు, బాలింతలకు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్‌ అభిలాష అభినవ్‌ వైద్యులకు సూచించారు. జిల్లా కేంద్రంలోని ప్రభు త్వ మాతాశిశు ఆస్పత్రిని మంగళవారం తనిఖీ చేశా రు. ఆస్పత్రి ఆవరణలోని మహిళా శక్తి క్యాంటీన్‌ పరిశీలించి భోజనం నాణ్యత, పరిశుభ్రత వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ల్యాబొరేటరీ, స్కానింగ్‌ కేంద్రం, ఇన్‌ వార్డు, అవుట్‌ వార్డు, ఆపరేషన్‌ థియేటర్‌, ఓపీ, బాలింతల వార్డులను పరి శీలించి రోగుల పరిస్థితి, అందిస్తున్న వైద్య సేవలు అడిగి తెలుసుకున్నారు. ప్రసవాల సమయంలో ఎలాంటి నిర్లక్ష్యం జరగకుండా చూసుకోవాలని వైద్యులకు సూచించారు. అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఆస్పత్రి ప్రాంగణంలో శుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించి ప్రతీరోజు పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలన్నా రు. కలెక్టర్‌ వెంట అదనపు కలెక్టర్‌ ఫైజాన్‌ అహ్మద్‌, జిల్లా ప్రధాన ఆస్పత్రి పర్యవేక్షకులు గోపాల్‌ సింగ్‌, ఆస్పత్రి పర్యవేక్షకులు సరోజ, వైద్యులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement