
మైనర్ డ్రైవింగ్పై స్పెషల్ డ్రైవ్
వాతావరణం
ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఆకాశం పాక్షికంగా మేఘావృతమవుతుంది. సాయంత్రం చిన్నపాటి వర్షం కురిసే అవకాశముంది.
● 296 మంది మైనర్ల పట్టివేత ● 100 మందిపై కేసులు నమోదు
నిర్మల్టౌన్: ఎస్పీ జానకీ షర్మిల ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని పోలీస్స్టేషన్ల పరిధి లో మైనర్ డ్రైవింగ్పై ఆదివారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. సుమారు 296 మంది మైనర్లు వాహనాలు నడుపుతూ పోలీసులకు పట్టుబడగా 100 మందిపై కేసులు నమోదు చేశారు. అనంతరం మైనర్ల తల్లిదండ్రులకు భైంసా ఏఎస్పీ అవినాష్కుమార్, నిర్మల్ ఏఎ స్పీ రాజేశ్మీనా మోటార్ వాహన చట్టాలపై అవగాహన కల్పించారు. రెండో విడత కౌన్సె లింగ్ మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో అదనపు ఎస్పీ ఉపేంద్రరెడ్డి ఆధ్వర్యంలో ఇవ్వనున్నట్లు తెలిపారు. నిర్మల్ ప ట్టణంలో ఏఎస్పీ రాజేశ్మీనా, పట్టణ సీఐ ప్రవీణ్కుమార్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించగా 10 ద్విచక్ర వాహనాలు పట్టుబడ్డా యి. భైంసా టౌన్లో 10 ద్విచక్ర వాహనా లు, నిర్మల్ రూరల్ పరిధిలో ఐదు, భైంసా రూరల్లో రెండు ద్విచక్ర వాహనాలు, రెండు ట్రాక్టర్లు, ఖానాపూర్ పట్టణంలో ఆరు, కుభీర్లో మూడు, కుంటాలలో ఆరు, బాసరలో ఐదు, లోకేశ్వరం ఏడు, ముధోల్లో నా లుగు, తానూరులో ఆరు, దస్తురాబాద్లో నాలుగు, కడెంలో నాలుగు, పెంబిలో ఒకటి, దిలావర్పూర్లో మూడు, నర్సాపూర్లో మూడు, సారంగపూర్లో ఏడు, లక్ష్మణచాందలో ఆరు, మామడలో రెండు, సోన్లో నా లుగు ద్విచక్ర వాహనాలను ఆయా స్టేషన్ల పరిధిలోని పోలీసులు పట్టుకున్నారు.