ఆర్థిక సాయం ప్రకటన.. బాధితులకు అండగా ఉంటా: విజయ్‌ | TVK Vijay Announce ex gratia On Karur Incident | Sakshi
Sakshi News home page

ఆర్థిక సాయం ప్రకటన.. బాధితులకు అండగా ఉంటా: విజయ్‌

Sep 28 2025 11:29 AM | Updated on Sep 28 2025 1:13 PM

TVK Vijay Announce ex gratia On Karur Incident

సాక్షి, చెన్నై: తమిళనాడులోని కరూర్‌లో జరిగిన విషాదకర ఘటనపై టీవీకే అధినేత, నటుడు విజయ్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు అండగా ఉంటామని హామీ ఇస్తూ ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.20లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. అలాగే, గాయపడిన వారికి రూ.2లక్షలు పరిహారం ఇస్తున్నట్టు తెలిపారు. 

ఇక, అంతకుముందు విజయ్‌ కరూర్‌ ఘటన తర్వాత ట్విట్టర్‌ వేదికగా కూడా ‍స్పందిస్తూ..‘నా హృదయం ముక్కలైంది. నేను భరించలేని బాధ, దుఃఖంలో ఉన్నాను. ఆ బాధ పదాల్లో వర్ణించలేనిది. కరూర్‌లో ప్రాణాలు కోల్పోయిన నా ప్రియమైన సోదరులు, సోదరీమణుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఈ అత్యంత విచారకరమైన మానసిక స్థితిలో, మన వారిని కోల్పోయినప్పుడు నా మనస్సు అనుభవిస్తున్న బాధను ఎలా వ్యక్తపరచాలో నాకు తెలియడం లేదు. నా కళ్లు, మనస్సు కలత చెంది బాధలో ఉన్నాయి. కుటుంబ సభ్యులను కోల్పోయిన మీకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ విచారాన్ని మీతో పంచుకుంటాను. 
ఇది మేము భర్తీ చేయలేని నష్టం. ఎవరు ఓదార్పునిచ్చినా, నష్టాన్ని మేము భరించలేము. అయితే, మీ కుటుంబంలో ఒకరిగా బంధువులను కోల్పోయి బాధపడుతున్న కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.20 లక్షలు, గాయపడి చికిత్స పొందుతున్న వారికి రూ.2 లక్షలు ఇవ్వాలని నేను భావిస్తున్నాను. నష్టం ముందు ఇది పెద్ద మొత్తం కాదు.

అయితే, ఈ సమయంలో మీ కుటుంబ సభ్యుడిగా మీతో నిలబడటం నా కర్తవ్యం. అదేవిధంగా, గాయపడి చికిత్స పొందుతున్న వారందరూ చాలా త్వరగా కోలుకుని ఇంటికి తిరిగి రావాలని నేను దేవుడిని ప్రార్థిస్తున్నాను. చికిత్స పొందుతున్న మా తమిళనాడు వెట్రి కగమగన్ ఖచ్చితంగా అన్ని విధాలుగా సహాయం అందిస్తుందని నేను మీకు హామీ ఇస్తున్నాను. దేవుని దయతో, మేము ప్రతి దాని నుండి కోలుకోవడానికి ప్రయత్నిస్తాము’ అని పోస్టు చేశారు. ’ అని పోస్టు చేశారు.

ఇదిలా ఉండగా.. తమిళనాడు కరూర్‌లో విజయ్‌ ప్రచార ర్యాలీలో తొక్కిసలాట ఘటన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 39 మంది ప్రాణాలు కోల్పోగా.. 50 మందికి పైగా గాయపడ్డారు. విజయ్‌ ప్రసంగిస్తుండగా.. కొందరు ఒక్కసారిగా ఆయనకు సమీపానికి వచ్చేందుకు ప్రయత్నించారు. దీంతో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటపై దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేసింది.

పోలీసు కేసు నమోదు..
కరూర్ తొక్కిసలాట ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. పుస్సీ ఆనంద్, సిటీ నిర్మల్ కుమార్ సహా మరో నలుగురిపై కేసు నమోదు అయ్యింది. కరూర్ నగర పోలీస్ స్టేషన్‌లో u/s 105, 110, 125(b), 223 r/w 3 of TNPPDL Act కింద కేసు ఫైల్‌ చేశారు.

వివరాలు ఇలా.. 

A1. మతియజగన్ – కరూర్ వెస్ట్ జిల్లా కార్యదర్శి

A2. పుస్సీ ఆనంద్

A3. నిర్మల్ కుమార్,  ఇతరులు.

BNS సెక్షన్ 105 – హత్యతో సమానం కాని నేరపూరిత హత్యకు శిక్ష.

BNS సెక్షన్ 110 – నేరపూరిత హత్యకు ప్రయత్నం.

BNS సెక్షన్ 125 – మానవ ప్రాణాలకు ముప్పు కలిగించే తొందరపాటు/నిర్లక్ష్య చర్యలకు శిక్ష

BNS సెక్షన్ 223 – ప్రభుత్వ అధికారి ఆదేశాన్ని పాటించకపోవడం నేరం.

TNPPDL చట్టం సెక్షన్ 3 – ప్రజా ఆస్తికి నష్టం కింద కేసు నమోదు చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement