కార్తీకం స్పెషల్‌.. దేశంలోని ప్రముఖ శివాలయాలు | Top Shiv Temples in India | Sakshi
Sakshi News home page

కార్తీకం స్పెషల్‌.. దేశంలోని ప్రముఖ శివాలయాలు

Nov 3 2024 11:17 AM | Updated on Nov 4 2024 11:26 AM

Top Shiv Temples in India

దీపావళి అమావాస్య వెళ్లగానే కార్తీకమాసం ప్రవేశించింది. ఈ మాసంలో శివారాధన ఎంతో శ్రేష్టమని పెద్దలు చెబుతుంటారు. మనదేశంలో వేల  ఏళ్ల చరిత్ర కలిగిన అనేక పురాతన శివాలయాలు ఉన్నాయి. వాటిలో కొన్ని ఆలయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


కేదార్‌నాథ్ (ఉత్తరాఖండ్)
భారతదేశంలోని నాలుగు ధామాలలో కేదార్‌నాథ్‌ ఒకటి. ఉత్తరాఖండ్‌లోని గర్వాల్‌లో మందాకిని నదికి సమీపంలో ఉన్న కేదార్‌నాథ్ ఆలయం ఏప్రిల్ నుండి నవంబర్ వరకు తెరిచి ఉంటుంది. ఈ ఆలయం సముద్ర మట్టానికి 3583 మీటర్ల ఎత్తులో ఉంది.


లింగరాజ్ ఆలయం (భువనేశ్వర్)
భువనేశ్వర్‌లోని పురాతన శివాలయాలలో లింగరాజ ఆలయం ఒకటి. ఈ ఆలయాన్ని సోమవంశీ రాజవంశానికి చెందిన రాజు జజాతి కేశరి నిర్మించాడని చెబుతారు. ఈ ఆలయం సుమారు 1000 సంవత్సరాల పురాతనమైనది. ఈ ఆలయంలో ప్రధాన దైవం శివుని స్వరూపమైన హరిహరుడు. ఈ ఆలయ ప్రస్తావన సంస్కృత గ్రంథాలలో కనిపిస్తుంది.


నాగేశ్వర దేవాలయం (గుజరాత్)
ఈ ఆలయం ద్వారకకు 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది భారతదేశంలోని 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. ఈ ఆలయాన్ని నాగనాథ్ దేవాలయం అని కూడా అంటారు. ఇది గుజరాత్‌లోని అత్యంత ప్రసిద్ధ శివాలయాలలో ఒకటి. నాగేశ్వర్ జ్యోతిర్లింగాన్ని పూజించడం వల్ల ఎలాంటి విషం శరీరంలోకి ప్రవేశించదని భక్తులు నమ్ముతారు.


కాశీ విశ్వనాథ దేవాలయం (ఉత్తర ప్రదేశ్‌)
కాశీ విశ్వనాథ దేవాలయం వారణాసిలో పవిత్ర గంగానదికి పశ్చిమ ఒడ్డున ఉంది. బంగారు పూతతో కూడిన గోపురాల​కు ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది. కాశీ విశ్వనాథుని సమక్షంలో చివరి శ్వాస తీసుకునే వారు జనన మరణ చక్రం నుండి విముక్తి పొందుతారని చెబుతారు.


శివోహం శివాలయం (బెంగళూరు)
శివుని ఆలయాలలో ఇది ఒకటి. ఈ ఆలయంలో 65 అడుగుల ఎత్తయిన శివుని విగ్రహం ఉంది. శివోహం శివాలయంలో అతిపెద్ద శివలింగ ద్వారం కూడా ఉంది. ఇక్కడ శివునితో పాటు 32 అడుగుల ఎత్తయిన వినాయకుడి విగ్రహం కూడా ఉంది. ఈ శివాలయంలో ఏ కోరిక కోరినా తప్పకుండా నెరవేరుతుందని నమ్మకం.


మురుడేశ్వర్ (కర్ణాటక)
ఉత్తర కర్ణాటకలోని మురుడేశ్వర్‌లో  ఎత్తయిన శివుని విగ్రహం ఉంది. ఆలయం వెనుక అరేబియా సముద్రం గంభీరంగా కనిపిస్తుంది. ఈ విగ్రహానికి సమీపంలో 20 అంతస్తుల శివుని ఆలయం కూడా  ఉంది. ఈ ఆలయాన్ని చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి జనం ఇక్కడికి తరలివస్తుంటారు.


సిద్ధేశ్వర్ ధామ్ (సిక్కిం)
సిద్ధేశ్వర్ ధామ్ ఆలయం సిక్కిం రాజధాని గాంగ్టాక్‌కు సమీపంలో ఉంది. విష్ణువు, కృష్ణుడు, జగన్నాథుడు శివుని ఆలయాలు  ఇక్కడ ఉన్నాయి. 12 జ్యోతిర్లింగాలతో పాటు 108 అడుగుల ఎత్తయిన శివుని విగ్రహం కూడా ఇక్కడ ఉంది.

ఇది కూడా చదవండి: పార్వతీపురంలో గజ రాజుల బీభత్సం
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement