తమిళనాడులో ఘోర ప్రమాదం.. భారీగా మృతులు? | Tamil Nadu Virudhnagar Fire Accident News Updates | Sakshi
Sakshi News home page

తమిళనాడులో ఘోర ప్రమాదం.. భారీగా మృతులు?

Apr 13 2026 10:44 AM | Updated on Apr 13 2026 11:00 AM

Tamil Nadu Virudhnagar Fire Accident News Updates

తమిళనాడులో ఘోర ప్రమాదం సంభవించింది. విరుధ్‌నగర్‌ జిల్లా సాత్తూర్‌లోని ఓ బాణాసంచా గోదాంలో సోమవారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఐదు గదులు పూర్తిగా ధ్వంసం ​ఆయ్యాయి. ప్రమాద సమయంలో 60 మంది లోపల ఉన్నట్లు సమాచారం.

టపాసులు తయారు చేస్తుండగా పేలుడు సంభవించినట్లు ప్రాథమిక సమాచారం. అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఐదు ఫైరింజన్లతో మంటలు ఆర్పే ప్రయత్నాలు చేస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గాయపడిన వాళ్లను ఆస్పత్రికి తరలిస్తున్నారు. చాలా మంది కార్మికులు లోపలే ఉన్నారని యాజమాన్యం చెబుతోంది. దీనిని బట్టి మృతుల సంఖ్య భారీగా ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement