పక్షిని ఢీకొని.. నాగ్‌పూర్‌లో ఇండిగో విమానం అత్యవసర ల్యాండింగ్ | Suspected Bird Strike On IndiGo Nagpur-Kolkata Flight | Sakshi
Sakshi News home page

పక్షిని ఢీకొని.. నాగ్‌పూర్‌లో ఇండిగో విమానం అత్యవసర ల్యాండింగ్

Sep 2 2025 11:20 AM | Updated on Sep 2 2025 11:35 AM

Suspected Bird Strike On IndiGo Nagpur-Kolkata Flight

నాగపూర్‌: మహారాష్ట్రలోని నాగపూర్‌లో తృటిలో విమాన ప్రమాదం తప్పింది. నాగ్‌పూర్ నుండి కోల్‌కతాకు వెళ్తున్న విమానాన్ని తిరిగి నాగపూర్‌లో అత్యవసర ల్యాండింగ్ చేయాల్సివచ్చింది. ఒక పక్షి ఢీకొనడంతో విమానం ముందు భాగం దెబ్బతింది. దీంతో పైలట్ అత్యవసర ల్యాండింగ్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ ఘటన జరిగిన సమయంలో విమానంలో 272 మంది ప్రయాణికులున్నారు. ఘటన దరిమిలా వారంతా సురక్షితంగా ఉన్నారు.
 

విమానాన్ని పక్షి  ఢీకొన్నంతనే విమానం కుదుపునకు గురయ్యింది. దీంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. అయితే పైలట్  ఎంతో చాకచక్యంతో అత్యవసర ల్యాండింగ్ చేశారు. విమానాశ్రయం సీనియర్  డైరెక్టర్ అబిద్ రుహి ఒక ప్రకటనలో ‘ఇండిగోకు చెందిన నాగ్‌పూర్-కోల్‌కతా విమానం నంబర్ 6ఈ812ని పక్షి ఢీకొన్నదని, తరువాత విమానాన్ని సురక్షితంగా ల్యాండ్‌ చేయడం జరిగిందన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement