2029లోపు లోక్సభ, రాష్ట్ర శాసనసభలలో మహిళా రిజర్వేషన్ను సమర్థవంతంగా అమలు చేసేందుకు నారీ శక్తి వందన అధినియమ్కు సవరణ చేసేందుకు తమ మద్దతును తెలుపుతూ శివసేన మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఒక లేఖ రాసింది.
ప్రధాని మోదీకి రాసిన లేఖలో శివసేన అధినేత ఏక్నాథ్ షిండే, "ఈ బిల్లు శాసనసభలు, లోక్సభలో మహిళా రిజర్వేషన్ల సమర్థవంతమైన అమలుకు మార్గం సుగమం చేస్తుంది, భారత ప్రజాస్వామ్య ప్రస్థానంలో ఇది ఒక స్వర్ణ అధ్యాయం " అని పేర్కొన్నారు.
"ఈ చొరవ కేవలం శాసన సంస్కరణ మాత్రమే కాదు, పరిపాలన.. దేశ నిర్మాణంలో మహిళల నిర్ణయాత్మక భాగస్వామ్యాన్ని నిర్ధారించే దిశగా ఒక పరివర్తనాత్మక చర్య. ఇది న్యాయం, సమానత్వం, మహిళా సాధికారత పట్ల మీ (ప్రధాని మోదీ) అచంచలమైన నిబద్ధతను ప్రతిబింబిస్తూ, మన సమ్మిళిత ప్రజాస్వామ్య పునాదిని మరింత బలోపేతం చేస్తుంది" అని ఆయన అన్నారు.


