Rajnath Singh Approves Hike In Aid To Orphaned Children Of Ex-Servicemen - Sakshi
Sakshi News home page

కేంద్రం కీలక నిర్ణయం.. వారికి ప్రతీనెల రూ.3వేల ఆర్థిక సాయం

Jul 30 2022 3:23 PM | Updated on Jul 30 2022 4:47 PM

Rajnath Singh Approves Hike In Aid To Orphaned Children Of Ex Servicemen - Sakshi

Rajnath Singh.. కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. భారత రక్షణ దళాల్లో పనిచేసి ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సేవలు అందించి మృతి చెందిన కుటుంబాల పిల్లలకు ఆర్థికంగా బాసటగా నిలిచేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో కేంద్రం వారికి ఆర్థిక సాయాన్ని పెంచుతున్నట్టు పేర్కొంది. 

కాగా, సైనికుల అనాథ పిల్లలకు నెలకు ఇచ్చే ఆర్థిక సాయాన్ని రూ. 3వేలకు పెంచేందుకు కేంద్రం ఆమోదం తెలిపిందని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలిపారు.అయితే,  అనాథ పిల్లలకు ఇప్పటి వరకు వీరికి నెలకు రూ. 1,000 చెప్పున ఇస్తున్నారు. కాగా, రక్షణ దళాల్లో సేవలందించిన వారి కుటుంబాలను ఆదుకునేందుకే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పష్టం చేశారు.

ఇదిలా ఉండగా.. అనాథ పిల్లలు(​కుమార్తె, కుమారుడు)21 సంవత్సరాల లోపు ఉండాలి. వారికి వివాహం కాకపోతే వారు ఈ పథకానికి అర్హులు అవుతారు. ఇక, కేంద్రీయ సైనిక్ బోర్డు నిర్వహిస్తున్న పథకం ద్వారా ఆర్థిక సాయాన్ని మాజీ సైనికుల అనాథ పిల్లలకు అందిస్తున్నారు. 

ఇది కూడా చదవండి: స్మృతి ఇరానీ కూతురు బార్‌ కేసులో ట్విస్ట్‌.. కాంగ్రెస్‌ నేతలకు షాక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement