ప్రధాని మోదీ అవి గుర్తు చేసుకోవాలి: ప్రియాంక గాంధీ  | Priyanka Gandhi Say About Ramayana to Narendra Modi | Sakshi
Sakshi News home page

ప్రధాని మోదీ అవి గుర్తు చేసుకోవాలి: ప్రియాంక గాంధీ 

Mar 31 2024 5:03 PM | Updated on Mar 31 2024 5:11 PM

Priyanka Gandhi Say About Ramayana to Narendra Modi - Sakshi

ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో జరిగిన మహా ర్యాలీలో కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంక గాంధీ బీజేపీపై కీలక వ్యాఖ్యలు చేశారు. 'అధికారం శాశ్వతం కాదు, అహం ఒక్కరోజు నశించిపోతుంది' అన్న శ్రీరాముడి సందేశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ గుర్తు చేసుకోవాలని అన్నారు.

''అధికారంలో ఉన్నవారు తమను తాము రామభక్తులుగా అనుకుంటున్నారు. వారు ఒక భ్రమలో ఉన్నారని నేను నమ్ముతున్నాను'' అని వ్యాఖ్యానించారు.

పురాతన ఇతిహాసం 'రామాయణం'లోని సందేశాన్ని ప్రియాంక గాంధీ గుర్తు చేశారు. రాముడు సత్యం కోసం పోరాడుతున్నప్పుడు, అతనికి వనరులు లేవు, రథం కూడా లేదు. రావణునికి రథం, వనరులు, సైన్యం అన్నీ ఉన్నాయి. కానీ రాముడు రావణుని ఓడించాడు అని అన్నారు. రాబోయే రోజుల్లో బీజేపీ కనుమరుగవుతుంది, కాంగ్రెస్ పార్టీ తప్పకుండా విజయం సాదిస్తుందని ప్రియాంక గాంధీ పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement