వరుసగా రెండో రోజూ పెరిగిన పెట్రో ధర

Petrol Prices Hiked Across Metros For Second Consecutive Day - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఇంధన ధరలు వరుసగా రెండో  రోజుకూడా పెరిగాయి. దాదాపు 40 రోజుల  విరామం తరువాత  ఆదివారం(నిన్న) ఊపందుకున్న పెట్రోలు ధర సోమవారం కూడా పెరిగింది. దేశ  రాజధాని  ఢిల్లీతో పాటు మెట్రో నగరాల్లో ధరలు పెరిగాయి. ఢిల్లీలో పెట్రోల్ లీటరుకు 16 పైసలు, హైదరాబాదులో 14 పైసలు పెరగ్గా, డీజిల్ ధర యథాతథంగా ఉంది.

ప్రధాన నగరాల్లో పెట్రో ధరలు 
ఢిల్లీలో పెట్రోలు ధర లీటరుకు 80.73  రూపాయలు డీజిల్ ధర లీటరుకు 73.56 రూపాయలు
కోలకతా పెట్రోలు 82.30, డీజిల్ 77. 06  రూపాయలు
ముంబై పెట్రోలు 87.45,  డీజిల్  80.11 రూపాయలు 
చెన్నై పెట్రోలు  83. 87, డీజిల్  78. 86 రూపాయలు 

హైదరాబాద్ పెట్రోలు 83.93, డీజీల్  80.17రూపాయలు 
అమరావతి పెట్రోలు 85.54,  డీజీల్  81.32 రూపాయలు 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top