ప్రతిపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి సుదర్శన్ రెడ్డి నామినేషన్‌ దాఖలు | Opposition VP Candidate Justice B. Sudershan Reddy Files Nomination | Sakshi
Sakshi News home page

ప్రతిపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి సుదర్శన్ రెడ్డి నామినేషన్‌ దాఖలు

Aug 21 2025 11:55 AM | Updated on Aug 21 2025 12:17 PM

Oposition VP Candidate Justice B Sudarshan Reddy to File Nomination

న్యూఢిల్లీ: ప్రతిపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి, సుప్రీంకోర్టు రిటైర్డ్ జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి గురువారం తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. నామినేషన్‌ కార్యక్రమంలో కాంగ్రెస్‌ నేతలు మల్లిఖార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్‌, శరద్‌ పవార్‌, సంజయ్‌ రౌత్‌ తదితరులు పాల్గొన్నారు.

దీనికి ముందు ఆయన పార్లమెంటు ప్రాంగణంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్, మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ విగ్రహాలకు పూలమాలలు వేసి, నివాళులర్పించారు. నామినేషన్ల దాఖలుకు ఆగస్టు 21 చివరి తేదీ. ఆగస్టు 25లోపు అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకోవచ్చు. సెప్టెంబర్ 9న ఎన్నికలు జరగనున్నాయి. ఓట్ల లెక్కింపు కూడా అదే రోజున జరగనుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement