గుండెపోటుతో నవ వరుడు హఠాన్మరణం

Newly Wed Groom Dies Suddenly Due To Heart Attack - Sakshi

సాక్షి, అన్నానగర్‌: గుండెపోటుతో నవ వరుడు మృతిచెందిన ఘటన ఈరోడ్‌లో జరిగింది. నసియానూర్‌ కన్నవేలం పాళయానికి చెందిన ప్రకాష్‌ (36)కు ఈ నెల 23వ తేదీ వివాహం జరిగింది. శనివారం అత్తగారి ఇంటికి వెళ్లిన ప్రకాష్‌ మటన్‌ తిన్నాడు. తన భార్యతో అమ్మగారి ఇంటికి వచ్చాడు. రాత్రి మరోసారి మటన్‌ తిని పడుకున్నాడు.

ఆదివారం వేకువజామున 2 గంటలకు శరీరమంతా దురద పుడుతోందని చెప్పాడు. కొద్ది సేపటికే గుండెపోటు వచ్చింది. కుటుంబ సభ్యులు హుటాహుటిన పెరుందురై ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో చేర్పించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. కాంజీకోట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

(చదవండి: లంక నావికాదళం ఓవరాక్షన్‌.. సీఎం స్టాలిన్‌ ఫైర్‌)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top