బెంగళూరు: సీఎం సిద్దరామయ్య బెంగళూరులో కావేరి నివాసంలో సందడి నెలకొంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు ఇంటికి వస్తూ పోతూ ఉండడంతో శనివారం రద్దీ ఏర్పడింది. బోర్డు, కార్పొరేషన్ల పదవుల కోసం నాయకులు సిద్దును కలవడానికి వస్తున్నారు. రాజీనామా తరువాత సిద్దరామయ్యకు హైకమాండ్ పలు వాగ్దానాలు చేసింది.
రాబోయే మంత్రివర్గంలో ఆయన కోటాలో కొందరికి మంత్రి పదవులు లభిస్తాయి. సిద్దు ప్రభావం ఏమీ తగ్గబోదని తెలుస్తోంది. అనేకమంది ఎమ్మెల్యేలు సిద్దరామయ్యను కలిసి పదవుల కోసం విన్నవించారు. ప్రజలు కూడా పెద్దసంఖ్యలో రాగా, సీఎం వారి నుంచి వినతులను స్వీకరించారు.


