Lok Sabha Election 2024: ఎలక్షన్‌ టూరిజం జోరు! | Lok Sabha Elections 2024: 27 Percent Surge Reported In Inter-State Travel During Elections | Sakshi
Sakshi News home page

Lok Sabha Election 2024: ఎలక్షన్‌ టూరిజం జోరు!

May 10 2024 4:22 AM | Updated on May 10 2024 10:24 AM

Lok Sabha Election 2024: 27percent Surge Reported In Inter-State Travel during elections

అంతర్రాష్ట్ర ప్రయాణాల్లో 27% పెరుగుదల 

సాంస్కృతిక పర్యాటకం, వైల్డ్‌లైఫ్‌ టూరిజం, మెడికల్‌ టూరిజం, గ్రామీణ టూరిజం, హిమాలయన్‌ ట్రెక్కింగ్, టెంపుల్‌ టూరిజం. ఇలా మన దేశంలో పర్యాటకం ఎన్నో రకాలు! లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఇప్పుడు ఎన్నికల పర్యాటకం కూడా ఫుల్‌ స్వింగ్‌లో ఉంది! మన దేశంలో మామూలుగానే రైళ్లు, బస్సులు ఎప్పుడూ కిక్కిరిసే ఉంటాయి. పండుగలప్పుడైతే వాటిలో కాలు పెట్టే సందు కూడా ఉండదు! 

లోక్‌సభ ఎన్నికల సీజన్‌ కారణంగా దేశవ్యాప్తంగా ప్రయాణాలు ఏకంగా 27 శాతం పెరిగాయట! ఇక్సిగో, అభీబస్‌ వంటి ట్రావెల్‌ ప్లాట్‌ఫాంలు చెబుతున్న గణాంకాలివి. ముఖ్యంగా పోలింగ్‌ జరుగుతున్న రాష్ట్రాల్లో ప్రయాణాలు బాగా పెరిగినట్టు అభీబస్‌ సీవోవో రోహిత్‌ శర్మ తెలిపారు. తమిళనాడు, ఒడిశా, బిహార్, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్‌ నుంచి అంతర్రాష్ట ప్రయాణాల్లో గణనీయమైన పెరుగుదల నమోదైందట. 

‘‘బస్సు ప్రయాణాలకు డిమాండ్‌ తమిళనాడులో 27 శాతం, రాజస్తాన్‌లో 26 శాతం, ఉత్తరప్రదేశ్‌లో 24 శాతం, బీహార్‌లో 16 శాతం, ఒడిశాలో 10 శాతం పెరిగింది. కర్నాటక నుంచి తమిళనాడుకు బస్సు ప్రయాణం 21 శాతం, ముంబై నుంచి ఢిల్లీకి 52 శాతం, ఢిల్లీ నుంచి శ్రీనగర్‌కు 45 శాతం, చండీగఢ్‌ నుంచి శ్రీనగర్‌కు 48 శాతం, బెంగళూరు నుంచి ముంబైకి ఏకంగా 104 శాతం చొప్పున డిమాండ్‌ పెరిగింది’’ అని అభీబస్, ఇక్సిగో వెల్లడించడం విశేషం! 

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌  
 

Advertisement
 
Advertisement
Advertisement