Lawrence Bishnoi's aide killed inside Delhi's Tihar Jail - Sakshi
Sakshi News home page

తీహార్‌ జైలులో గ్యాంగ్‌వార్‌

Apr 15 2023 6:30 AM | Updated on Apr 15 2023 10:54 AM

Lawrence Bishnoi aide killed inside Delhi Tihar Jail - Sakshi

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని తీహార్‌ జైలులో శుక్రవారం ఖైదీల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయి ముఠా సభ్యుడు ప్రిన్స్‌ తేవాతియా మృతిచెందాడు. సాయంత్రం 5 గంటలకు జైలులో ఇరు వర్గాల మధ్య గ్యాంగ్‌వార్‌ జరిగినట్లు తెలిసింది.

తేవాతియా కత్తిపోట్లకు గురయ్యాడు. తీవ్రంగా గాయపడిన అతడిని దీన్‌దయాల్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. ఘర్షణలో గాయపడిన మరో ఐదుగురు ఖైదీలను అధికారులు ఆసుపత్రికి తరలించారు.  

Advertisement
 
Advertisement
Advertisement