గ్యాస్‌ సిలిండర్‌ పేలి 9 మంది మృతి

Gas cylinder leakage in gujarat - Sakshi

అహ్మదాబాద్‌: ఇంట్లోని ఎల్పీజీ గ్యాస్‌ సిలిండర్‌ లీకేజీతో సంభవించిన పేలుడులో నలుగురు చిన్నారులు సహా 9 మంది తీవ్ర గాయాలతో చనిపోయారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ శివారులో ఈనెల 20వ తేదీ రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటనలో బాధితులంతా మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లా మధుసూదన్‌గర్‌కు చెందిన వారు. ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం ముగ్గురు, శుక్రవారం ఐదుగురు, శనివారం ఒకరు చనిపోగా ఇంకొకరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.

‘కార్మికులు, వారి కుటుంబసభ్యులు 9 మంది కలిసి ఒక ఇరుకు గదిలో నిద్రిస్తుండగా, ఆ గదిలోని ఎల్పీజీ సిలిండర్‌ లీకయింది. ఇది పసిగట్టి పొరుగునే ఉండే కుల్‌సింహ్‌ భైరవ అప్రమత్తం చేసేందుకు ఆ ఇంటి తలుపు తట్టాడు. నిద్రిస్తున్న ఒకరు లేచి, లైట్‌ స్విచ్‌ ఆన్‌ చేయగా, అప్పటికే గదంతా దట్టంగా వ్యాపించిన గ్యాస్‌ అంటుకుని మంటలు, పేలుడు సంభవించాయి. కుల్‌సింహ్‌ సహా మొత్తం 10 మందికి ఈ ఘటనలో తీవ్రంగా కాలిన గాయాలయ్యాయి. క్షతగాత్రులందరినీ వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. ఇప్పటివరకు చిన్నారులు సహా 9 మంది చనిపోగా, కుల్‌సింహ్‌ బైరవ పరిస్థితి విషమంగా ఉందని శనివారం పోలీసులు తెలిపారు. భైరవ సొంతూరు రాజస్తాన్‌లోని కరౌలీ అని చెప్పారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top