న్యూఢిల్లీ: దేశం ప్రస్తుతం భయంకరమైన ఉష్ణోగ్రతల మధ్య విలవిల్లాడుతోంది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ జిల్లా, శంకర్గఢ్ బ్లాక్లో పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. దేశంలోనే అత్యంత వేడి ప్రాంతమైన బందాకు కేవలం మూడు గంటల దూరంలో ఉన్న ఈ ప్రాంతంలో, ప్రజలు చుక్క నీటి కోసం అష్టకష్టాలు పడుతున్నారు. తీవ్రమైన వేడిగాలుల మధ్య, కనీస సౌకర్యాలు లేక గ్రామస్థులు పడుతున్న అవస్థలు వర్ణనాతీతం.
నీటి కోసం నిత్యం 10 కిలోమీటర్ల నడక
ప్రస్తుత ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ను దాటి మండిపోతున్నాయి. ఈ క్రమంలో శంకర్గఢ్కు చెందిన 150 మంది తాగునీటి కోసం ప్రతిరోజూ 10 కిలోమీటర్ల దూరం కాలినడకన ప్రయాణించాల్సిన దుస్థితి నెలకొంది. సంవత్సరాలుగా ఈ సమస్య కొనసాగుతున్నా, తమ గోడు వినేవారు ఎవరూ లేరని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీటి సదుపాయంతో పాటు కరెంటు లేకపోవడంతో వీరి జీవితాలు మరింత అంధకారంలోకి మగ్గుతున్నాయి..
అత్యంత వేడిగా ‘బందా’.. చుట్టుపక్కల ప్రాంతాల్లో అలజడి
ఉత్తరప్రదేశ్లోని బందా ప్రస్తుతం భారతదేశంలోనే అత్యంత వేడి ప్రాంతంగా నమోదైంది. ఇక్కడ ఉష్ణోగ్రతలు 48 డిగ్రీల సెల్సియస్కు చేరుకోవడంతో, ఉదయం 10 గంటల తర్వాత రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. బందాకు దగ్గరగా ఉన్న శంకర్గఢ్లో కూడా ఇదే విధమైన వాతావరణ పరిస్థితులు ఉండటంతో, ప్రజల ఆరోగ్యం జీవనోపాధి దెబ్బటింటున్నాయి.
ప్రభుత్వ స్పందన మరియు తీసుకుంటున్న చర్యలు
ఈ సమస్యపై అదనపు జిల్లా మేజిస్ట్రేట్ వినీత సింగ్ స్పందిస్తూ, క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షించాలని అధికారులను ఆదేశించామన్నారు. అవసరమైన చోట ట్యాంకర్ల ద్వారా వెంటనే నీటిని సరఫరా చేస్తామని, మౌలిక సదుపాయాల మరమ్మతులకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే, గడిచిన 23 రోజులుగా హీట్వేవ్ అలర్ట్లను జారీ చేస్తున్నామని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు.


