‘పార్టీ మారే ప్రసక్తే లేదు.. సీఎం పదవి ఏనాడు ఆశించలేదు’ | DK ShivaKumar Visits Mantralayam | Sakshi
Sakshi News home page

‘పార్టీ మారే ప్రసక్తే లేదు.. సీఎం పదవి ఏనాడు ఆశించలేదు’

Oct 22 2025 9:22 PM | Updated on Oct 22 2025 9:29 PM

DK ShivaKumar Visits Mantralayam

కర్నూలు:  పార్టీ మారే ఆలోచన తనకు ఎప్పుడూ లేదన్నారు  కాంగ్రెస్‌ నేత, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌. అదే సమయంలో సీఎం పదవి కూడా తాను ఏనాడు ఆశించలేదన్నారు. అధిష్టానం ఆదేశాల మేరకే నడుచుకుంటానని, పార్టీ కోసం కష్టపడతానన్నారు. ఈరోజు(బుధవారం, అక్టోబర్‌ 22వ తేదీ) మంత్రాలయం శ్రీ మఠం పీఠాధిపతులు శ్రీ సుభుధేంద్ర తీర్థ స్వామిజీ ఆశీస్సులు తీసుకున్నారు.  

శ్రీ సుభుధేంద్ర తీర్థ స్వామిజీ ఆహ్వానం మేరకు తాను మంత్రాలయం వెళ్లినట్లు డీకే శివకుమార్‌ తెలిపారు. ఇందులో ఎటుంటి రాజకీయ ఉద్దేశం లేదన్నారు. జోడో భారత్‌ యాత్రలో కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీతో కలిసి  శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనం చేసుకున్నానని,  తమ పార్టీ అధికారం చేపట్టడంతో మళ్లీ రావడం జరిగిందన్నారు.  రాజకీయాలకు అతీతంగా మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామిని దర్శనం చేసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. 

 

‘ఇదీ చదవండి: 
మా నాన్న తర్వాతి సీఎం ఆయనే’.. బాంబు పేల్చిన సిద్ధరామయ్య కుమారుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement