అస్సాంలో తమను గెలిపిస్తే యువతకు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని బీజేపీ పేర్కొంది. ‘బంగ్లాదేశీ చొరబాటుదారులు ఆక్ర మించిన భూములను విడిపించి స్థానికులకు అందజేస్తాం. ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ)ను అమలు చేస్తాం’’అని మేనిఫెస్టోలో ప్రకటించింది. ఈ మేరకు 31 హామీలతో కూడిన బీజేపీ ‘సంకల్పపత్ర’ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం గువాహటిలో విడుదల చేశారు. ఇక అస్సాంలో ఏప్రిల్ 9న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
మేనిఫెస్టోలో ముఖ్యాంశాలు..
అరుణోదయ్ పథకం లబ్ధిదారులైన మహిళలకు ఆర్థిక సాయం ప్రస్తుత రూ.1,250 నుంచి క్రమంగా రూ.3,000కు పెంపు
గిరిజనులతో సహా అర్హులైన తేయాకు కార్మికులందరికీ భూ పట్టాలు. రూ.500 చొప్పున వేతన పెంపు.
అక్రమ చొరబాటుదారులకు దేశ బహిష్కరణ
ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ) అమలుతో అస్సామీల నాగరికత, వారసత్వం, హక్కుల పరిరక్షణ
మిషన్ వసుంధర’లో భాగంగా చొరబాటుదారుల చేతుల్లో ఉన్న ప్రతి అంగుళం భూమికీ విముక్తి. వాటిపై అసలైన అస్సామీ పౌరులకు భూ హక్కులు.


