ఢిల్లీలో పెరుగుతున్న రికవరి రేటు.. | 3714 Corona Positive Cases Recorded In New Delhi | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో పెరుగుతున్న రికవరి రేటు..

Sep 23 2020 10:09 PM | Updated on Sep 23 2020 10:09 PM

3714 Corona Positive Cases Recorded In New Delhi  - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానిలో 2 లక్షల 56 వేలు కరోనా పాజిటివ్ కేసుల నమోదయ్యాయి.  గడచిన 24 గంటలలో  3,714  “కరోనా” పాజిటివ్ కేసులు నమోదు కాగా, 4,465 మంది డిశ్ఛార్జ్ అయ్యారు. గత 24 గంటలలో కరోనా కారణంగా 36 మంది మృతి చెందారు. ఇప్పటివరకు నమోదయిన కేసుల సంఖ్య 2,56,789కాగా, మొత్తం మృతుల సంఖ్య 5,087మంది. ఇప్పటివరకు చికిత్స పూర్తి చేసుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 2,20,866కు చేరింది.

కాగా ఢిల్లీలో “యాక్టివ్” కేసుల సంఖ్య 30,836 ఉండగా, ఈ రోజు నిర్వహించిన కరోనా ఆర్‌టీపీసీఆర్‌ టెస్ట్ల సంఖ్య 10,359. ఢిల్లీ లో ఈ రోజు 49,221 ర్యాపిడ్ టెస్ట్‌లు నిర్వహించారు. ఇప్పటి వరకు 26,97,333 కరోనా టెస్టులను నిర్వహించారు. అయితే హోం ఐసోలేషన్ లో 17,834 కేసులు ఉన్నాయి.  ఢిల్లీ లో కంటైన్మెంట్ జోన్ల సంఖ్య 1987 కాగా,  ప్రభుత్వ,  ప్రైవేట్ హాస్పటల్స్ లో 15,810 బెడ్లు అందుబాటులో ఉన్నాయి. అయితే  ప్రతి  మిలియన్ జనాభాలో కరోనా టెస్ట్ల సంఖ్య 1,41,964.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement