బెంగాల్‌లో పిడుగులు పడి 20 మంది మృతి 

20 Killed In Lightning Strikes In Bengal - Sakshi

రూ. 2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని 

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో సోమవారం పిడుగులు పడటంతో మూడు జిల్లాల్లో 20 మంది మరణించారని రాష్ట్ర విపత్తు నిర్వహణాధికారులు వెల్లడించారు. ముర్షిదాబాద్, హుగ్లీ జిల్లాల్లో 9 మంది చొప్పున మరణించగా, పూర్వ మేడినిపూర్‌ జిల్లాలో ఇద్దరు మరణించారు. ముర్షిదాబాద్‌ జిల్లాలో మరో ముగ్గురు గాయపడ్డారని, జంగిపూర్‌ ఆస్పత్రిలో వీరు చికిత్స పొందుతున్నారని వెల్లడించారు.

ఈ ఘటనపై ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ట్వీట్‌ చేశారు. మరణించిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రకటిస్తున్నట్లు మోదీ పేర్కొన్నారు. గాయపడిన వారికి రూ. 50 వేలు ఇవ్వనున్నట్లు తెలిపారు. త్వరలో రుతుపవనాలు బెంగాల్‌ను తాకనున్న నేపథ్యంలో ఈ మెరుపులు రావడం గమనార్హం.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top