విషాదం నింపిన విహారయాత్ర | 2 Lost Life By Boat Capsizes In Mingachal River Chhattisgarh | Sakshi
Sakshi News home page

విషాదం నింపిన విహారయాత్ర

Jan 6 2021 8:05 PM | Updated on Jan 6 2021 8:50 PM

2 Lost Life By Boat Capsizes In Mingachal River Chhattisgarh - Sakshi

రాయ్‌పూర్‌‌: ఛత్తీస్‌గఢ్‌లో బుధవారం విహారయాత్ర పెనువిషాదాన్ని నింపింది. విహారయాత్రకని వెళ్లిన 20 మంది బాలికల బృందంలోని ఇద్దరు పడవలో ప్రయాణిస్తూ అదుపు తప్పి నీటిలో పడి గల్లంతయ్యారు. బీజాపూర్‌ జిల్లాలోని జంగ్లా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలు.. 20 మంది బాలికల బృందం బీజాపూర్‌ జిల్లాలోని మింగాచల్‌ నదికి విహారయాత్రకని వచ్చారు. వారిలో ఇద్దరు బాలికలు సరదాగా పడవ ఎక్కారు. అయితే కాసపటికే ప్రమాదవశాత్తు పడవ నదిలో బోల్తా పడడంతో ఇద్దరు బాలికలు నదిలో గల్లంతయ్యారు. ఈ ఘటనతో భయాందోళనకు గురైన మిగతా బాలికలు అధికారులకు సమాచారం అందించారు. అధికారులు గజ ఈతగాళ్లను రప్పించి  గాలింపు చర్యలు చేపట్టగా ఇద్దరు బాలికల మృతదేహాలు లభ్యమయ్యాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement