ఎప్‌సెట్‌ కేంద్రం తనిఖీ | - | Sakshi
Sakshi News home page

ఎప్‌సెట్‌ కేంద్రం తనిఖీ

May 11 2026 7:26 AM | Updated on May 11 2026 7:26 AM

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: జేపీఎన్‌సీ కళాశాలలో జరుగుతున్న ఎప్‌సెట్‌ పరీక్ష కేంద్రాన్ని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ బాలకిష్టారెడ్డి, పాలమూరు యూనివర్సిటీ వీసీ శ్రీనివాస్‌ ఆదివారం తనిఖీ చేశారు. పరీక్ష కేంద్రంలో విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాలు, పరీక్షల నిర్వహణపై పకడ్బందీ చర్యలపై అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు రెండు సెషన్స్‌లో పరీక్షలు నిర్వహిస్తుండగా మొత్తం 360 మంది విద్యార్థులకు 345 మంది హాజరయ్యారు. వారి వెంట కళాశాల పరీక్షల నిర్వహణ అధికారి కోటాల సందీప్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement