పాన్గల్: పండుగలు శాంతియుతంగా జరుపుకొంటూ అందరికీ ఆదర్శంగా నిలవాలని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కోరారు. ఆదివారం మండలంలోని మాందాపూర్లో వీరభద్రుడి ఉత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న అంతర్రాష్ట్ర బండలాగుడు పోటీలను వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు రోజువారి పనులతో పాటు కొంత సమయం దైవ భక్తికి కేటాయించాలన్నారు. చదువుతోనే సమాజంలో మంచి గుర్తింపు, గౌరవం లభిస్తుందని.. తమ పిల్లలను బాగా చదివించాలని సూచించారు. అంతకుముందు మంత్రి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. పోటీలకు ఆర్థిక తోడ్పాటునందించిన మంత్రిని ఆలయ కమిటీ సభ్యులు శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోవర్ధన్సాగర్, సర్పంచ్ సుగుణమ్మ, ఉప సర్పంచ్ శ్యాంసుందర్రెడ్డి, మాజీ సర్పంచ్లు కృష్ణయ్యసాగర్, జయరాములుసాగర్, కమిటీ సభ్యులు కుపేందర్రెడ్డి, పరమేష్, మహేష్, నర్సింహరాజు, భగవంతు పాల్గొన్నారు.
అర్హులందరికీ సంక్షేమ ఫలాలు..
ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో ఆర్భాటాలకు పోయి అప్పుల పాలు కావద్దని మంత్రి జూపల్లి లబ్ధిదారులకు సూచించారు. గ్రామంలో సర్పంచ్ సుగుణమ్మ ఇంటి గృహ ప్రవేశం చేసి మాట్లాడారు. ప్రభుత్వం అందించే రూ.5 లక్షలతో నిబంధనల మేరకు ఇంటిని నిర్మించుకోవాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందుతాయని చెప్పారు.
రాష్ట్ర ఎకై ్సజ్శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు


