
మెరుగైన విద్యాబోధన..
జిల్లాలో 13 కస్తూర్బా పాఠశాలలు ఉన్నాయి. అన్నింటిలో పదో తరగతి వరకు విద్యాబోధన కొనసాగతుండగా.. ముందుగా నారాయణపేట, ధన్వాడ, మక్తల్, దామరగిద్ద, ఊట్కూర్ కస్తూర్బాలలో ఇంటర్ తరగతులు నిర్వహిస్తు వస్తున్నారు. అనంతరం నర్వ, మద్దూరు, కృష్ణా కేజీబీవీలను అప్గ్రేడ్ చేశారు. ఈ విద్యాలయాల్లో వసతితోపాటు నాణ్యమైన విద్య అందిస్తున్నారు. ప్రస్తుతం మైనారిటీ, జ్యోతిబాపూలే, సాంఘిక సంక్షేమ గిరిజన కళాశాలలు ఉన్నప్పటికీ ఆయా కేటగిరీల వారికి అత్యధిక శాతం సీట్లు కేటాయిస్తోంది. దీంతో పేద వారికి, అనాథలకు సీట్లు లభించే పరిస్థితి లేకపోవడంతో కస్తూర్బాలోనే ఇంటర్ కోర్సులను ప్రవేశపెట్టారు. ఈ ఏడాది ఇంటర్ ఫలితాల్లో కేజీబీవీ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించి ప్రతిభ కనబర్చారు. తాజాగా మరికల్, కోస్గి, మాగనూర్ కేజీబీవీలను ఇంటర్ తరగతులను నిర్వహించేందుకు ప్రభుత్వం ఆప్గ్రేడ్ చేస్తు ఉత్తర్వులు జారీ చేసింది.