
‘ప్రజావాణి’కి 36 ఫిర్యాదులు
నారాయణపేట: ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ స్వయంగా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. మొత్తం 36 రాగా.. వీటిని కలెక్టర్ జెడ్పీసీఈఓ శైలేష్కుమార్కు అందజేసి పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో కలెక్టరేట్ ఏఓ జయసుధ,డీఆర్డీఓ మొగులప్ప, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
పోలీస్ గ్రీవెన్స్కు 8 అర్జీలు
జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పోలీస్ గ్రీవెన్స్కు 8 అర్జీలు రాగా.. ఎస్పీ యోగేష్ గౌతమ్ నేరుగా స్వీకరించారు. ఇందులో రెండు ఆస్తి తగాదాలు, మూడు భూ తగదాలు, రెండు ప్యామిలీ గొడవలు, ఒకటి డబ్బులకు సంబంధించిన ఫిర్యాదులు అందాయనిచ వాటిని సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి తక్షణమే చర్యలు తీసుకోవాలని ఎస్పి సూచించారు.