
ఆర్టీసీలో ఆన్లైన్ చెల్లింపులు
నారాయణపేట
మంగళవారం శ్రీ 27 శ్రీ మే శ్రీ 2025
వివరాలు 8లో u
నారాయణపేట రూరల్: ఆర్టీసీ బస్సుల్లో ఆన్లైన్ పేమెంట్ల దిశగా సంస్థ అడుగులు వేస్తుంది. ఎలక్ట్రానిక్ టికెట్ ఇష్యూ మెషిన్ (ఈ టీమ్స్) స్థానంలో నూతనంగా ఇంటెలిజెన్స్ టికెట్ ఇష్యుయింగ్ మిషన్స్ (ఐ –టిమ్స్) లని ప్రవేశపెట్టింది. ఈ మిషన్ల ద్వారా ప్రయాణికులు యూపీఐ, గూగుల్ పే, ఫోన్ పేతో పాటు ఏటీఎం కార్డ్ స్వైపింగ్ ద్వారా టికెట్టుకు సరిపడా డబ్బులను ఆన్లైన్లోనే చెల్లించి టికెట్ పొందే అవకాశం ఉంది. కండక్టర్ ఐ –ట్రిమ్ మిషన్లో ప్రయాణికుడి గమ్యస్థానం ఎంటర్ చేసిన తర్వాత క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి డబ్బులు చెల్లిస్తే వెంటనే మిషన్ నుంచి టికెట్ బయటికి వస్తుంది. ఈ సదుపాయం ఇప్పటికే జిల్లాలోని నారాయణపేట, కోస్గి డిపోలో ఎక్స్ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ సర్వీస్ లలో ఇటీవల అమలు చేశారు.
జిల్లాలో ఇలా..
జిల్లాలో నారాయణపేట, కోస్గి డిపోలు ఉన్నాయి. వీటి పరిధిలో 61 పల్లె వెలుగు, 40 ఎక్స్ ప్రెస్, 6 డీలక్స్ లతోపాటు ఒక సూపర్ లగ్జరీ బస్సు ఉంది. నారాయణపేటలో 24 రూట్లకుగాను 88 షెడ్యూల్స్ ఏర్పాటుచేసి ప్రతిరోజు సుమారుగా 36వేల కిలోమీటర్లు బస్సులు నడవడంతో సరాసరి రూ. 23 లక్షల ఆదాయం సమకూరుతుంది. అదేవిధంగా కోస్గి డిపోలో ఎనిమిది రూట్లకు గాను 16 షెడ్యూల్స్ ఉన్నాయి. నిత్యం 5,500 కిలోమీటర్లు బస్సులు నడవగా రూ.4 లక్షల ఆదాయం సమకూరుతుంది. గతంలో నారాయణపేటలో 120 ఈ టీమ్స్ మిషన్లు ఉండగా వాటి స్థానంలో 80 ఐ టిమ్స్ మిషన్లు వచ్చాయి. ఇక కోస్గిలో 20 ఈ టీమ్స్ మిషన్ల స్థానంలో 15 ఐ టీమ్స్ మిషన్లు పంపించారు. వాటిని పల్లె వెలుగు మినహా అన్ని సర్వీసుల్లో ఐ టిమ్స్ మిషన్లని ఉపయోగిస్తున్నారు. ఇప్పటికే ఈ ఆన్లైన్ చెల్లింపులపై సూపర్వైజర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. వారి ద్వారా కండక్టర్లు, వన్ మెన్ సర్వీస్ చేసే డ్రైవర్లకు శిక్షణ ఇప్పించారు.
‘ఐ టిమ్స్’తో ఉపయోగం
ఒక ట్రిప్పునకు సంబంధించి రిపోర్టు, వచ్చిన ఆదాయం వివరాలు ఐ – టిమ్స్ మిషన్లతో సులభంగా తెలియనున్నాయి. డినామినేషన్కు వీలుగా యంత్రంలో ఏర్పాటు ఉండడంతో డ్యూటీ అయిపోయిన తర్వాత డబ్బులు అప్పగించడం చాలా సులభం అవుతుంది. యూపీఐ విధానంలో డబ్బులు చెల్లించే వెసులుబాటు ఉండటంతో ప్రయాణికులకు, కండక్టర్లకు చిల్లర కోసం ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు.
న్యూస్రీల్
బైరంకొండకు చెందిన వ్యక్తి నారాయణపేట నుంచి హైదరాబాద్కు వెళ్లేందుకు ఆర్టీసీ బస్సు ఎక్కాడు. అతను రూ.500 ఇచ్చి టికెట్ అడగగా.. సరిపడా చిల్లర ఇవ్వాలని కండక్టర్ కోరాడు. తనవద్ద చిల్లర లేవని చెప్పగా.. కండక్టర్ టికెట్ వెనక బ్యాలెన్స్ డబ్బులు రాసి ఇచ్చారు. మరికొందరికి ఇలానే రాసిచ్చాడు. చివరకు హైదరాబాద్ చేరుకున్నాక.. అందరికీ కలిపి డబ్బులిచ్చి పంచుకోవాలని చెప్పడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. ఇలా ఆర్టీసీ బస్సు ఎక్కిన ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటూనే ఉన్నారు. వీటన్నింటికీ చెక్ పెట్టేందుకు ఆర్టీసీ క్రమంగా బస్సులో ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టమ్ను తీసుకొస్తుంది. జిల్లాలో కొన్ని రూట్లలో ఇటీవల ప్రారంభించింది.
జిల్లాకు చేరిన 80 ఐ– టిమ్స్ మిషన్లు
ఆర్డినరీ మినహా అన్ని బస్సుల్లో ఆన్లైన్లో చెల్లింపులు
చిల్లర సమస్యలకు చెక్

ఆర్టీసీలో ఆన్లైన్ చెల్లింపులు

ఆర్టీసీలో ఆన్లైన్ చెల్లింపులు

ఆర్టీసీలో ఆన్లైన్ చెల్లింపులు

ఆర్టీసీలో ఆన్లైన్ చెల్లింపులు

ఆర్టీసీలో ఆన్లైన్ చెల్లింపులు