కొనుగోలు కేంద్రాలు లేక రైతులకు వాటిల్లుతున్న నష్టం (రూ..ల్లో)
వరి ధాన్యం బస్తా 75 కిలోలు, మొక్కజొన్న, మినుము, జొన్న అయితే 100 కిలోలు లెక్కన తూకం వేస్తారు. అయితే తూకం సమయంలో సంచి తూకం అంటూ 2 కిలోలు, మట్టి తరగు కింద 2 కిలోలు, తేమ శాతం కింద మరో 2 కిలోలు లెక్కన దోచుకోవడం ఒక ఎత్తైతే ఎలక్ట్రానిక్ కాటాలో టెక్నిక్గా 4 నుంచి 5 కిలోలు మోసం చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ లెక్కన బస్తాకు 6 నుంచి 10 కిలలో వరకు అదనంగా లాగుతున్న విషయం బహిరంగగానే సాగుతోంది. రవాణా చార్జీలు, హమాలీ కూలీల ఖర్చు నిమిత్తం బస్తాకి మరో రూ. 60 చొప్పున రైతుపైనే భారం మోపుతున్నారు. వీటన్నింటి మూలంగా రైతన్నకు ఈ ఏడాది రమారమి బస్తాకు రూ.350 నుంచి రూ.550 వరకు కోల్పోవాల్సి వస్తోంది.
పొలాల్లోనే ధాన్యం నిల్వ చేసుకున్న దృశ్యం
పంట మద్దతు ధర దళారుల ధర క్వింటాకు నష్టం
వరి 2,461 1,900 560
మొక్కజొన్న 2,400 1,600 800
కందులు 8,450 7,900 550
మినుములు 8,200 6,900 1,300
కొనుగోలు కేంద్రాలు లేక
నష్టపోతున్న రైతులు
అన్నదాతలకు లభించని
కనీస మద్దతు ధర
పాలకవర్గం లేని
ఆళ్లగడ్డ వ్యవసాయ మార్కెట్ యార్డు
పట్టించుకోని పాలకులు, అధికారులు
దళారుల బారిన పడుతున్న రైతులు


