త్వరలో వినూత్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు
మహానంది: వినూత్నమైన కథతో త్వరలో ప్రేక్షకుల మందుకు వస్తున్నట్లు ప్రముఖ సినీ దర్శకుడు తేజ అన్నారు. మహానందీశ్వరుడి దర్శనానికి సోమవారం మహానందికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన శ్రీ కామేశ్వరీదేవి, శ్రీ మహానందీశ్వరస్వామి వార్లను దర్శించుకుని అభిషేకం, కుంకుమార్చన పూజలు చేపట్టారు. దర్శనం అనంతరం ఆలయ సూపరింటెండెంట్ అంబటి శశిధర్రెడ్డి, ఆలయ అర్చకులు దర్శకుడు తేజకు స్వామి, అమ్మవారి ప్రసాదాలు అందించి ఆశీర్వచనాలు చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మంచి చిత్రాలకు ఎప్పుడూ ప్రేక్షకుల్లో ఆదరణ ఉంటుందన్నారు. ఆయన వెంట బొల్లవరం ప్రసాద్, మిత్రులు పాల్గొన్నారు. పలువురు అభిమానులు ఫొటోలు తీసుకున్నారు.


