
సంగమేశ్వర శిఖరానికి పూజలు
కొత్తపల్లి: సప్తనది సంగమ ప్రాంతంలో వెలసిన ప్రాచీ న సంగమేశ్వరాల యం జాలాధివాసం అవుతున్న తరుణంలో ఆలయ శిఖరానికి ప్రత్యేక పూజలను ఆదివారం చేశారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయం నీటిమట్టం 855 అడుగులకు చేరుకుంది. దీంతో ఆలయ గోపురానికి నీటిమట్టం చేరుకుంది. మరికొద్ది రోజుల్లోనే ఈ ఆలయం పూర్తిగా కృష్ణమ్మ ఒడిలోకి చేరుకుంటుంది. ఆలయపురోహితులు తెలకపల్లి రఘురామ శర్మ మరబోటులో వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. శిఖర భాగంపై కృష్ణాజలాలతో అభిషేకం, క్షీరాభిషేకం, కుంకుమార్చన, పుష్పార్చన, తదితర విశేష పూజాకార్యక్రమాలు నిర్వహించారు.

సంగమేశ్వర శిఖరానికి పూజలు