
శ్రీశైలం డ్యాంకు పెరుగుతున్న వరద ఉద్ధృతి
శ్రీశైలంప్రాజెక్ట్: శ్రీశైలం జలాశయానికి రోజురోజుకు వరద ఉద్ధృతి పెరుగుతుంది. జూరాల ప్రాజెక్ట్లో స్పిల్వే ద్వారా, విద్యుత్ ఉత్పాదన అనంతరం, తుంగభద్ర నీరు సుంకేసుల ద్వారా వేలాది క్యూసెక్కులు విడుదలవుతోంది. అదే విధంగా లోకల్ క్యాచ్మెంట్లో కురుస్తున్న వర్షాలు కూడా వీటికి తోడు కావడంతో జలాశయం లోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. నీటిమట్టం గణనీయంగా పెరుగుతోంది. శనివారం నుంచి ఆదివారం వరకు ఎగువ పరీవాహక ప్రాంతాల నుంచి 76,178 క్యూసెక్కుల వరదనీరు డ్యామ్కు చేరుకున్నాయి. డ్యామ్లో నీటినిల్వలు పెంచడం కోసం గత నాలుగు రోజులుగా విద్యుత్ ఉత్పాదనను నిలిపివేయడమే కాకుండా, బ్యాక్ వాటర్ నుంచి దిగువ ప్రాజెక్ట్లకు నీటి విడుదలను నిలిపేశారు. ఆదివారం సాయంత్రానికి జలాశయంలో 92.4860 టీఎంసీల నీరు నిల్వ ఉంది. డ్యాం నీటిమట్టం 855.20 అడుగులకు చేరుకుంది.