
తలుపులు తెరుచుకున్న వసతి గృహాలు
ఆలూరు: ఎట్టకేలకు బీసీ బాలుర వసతి గృహం, ప్రభుత్వ కళాశాల బాలుర విద్యార్థులకు కోసం ఏర్పాటు చేసిన వసతి గృహం తెరుచకున్నాయి. వసతి గృహాలు మూతబడి విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సాక్షి దినపత్రికలో వార్తా కథనం రావడంతో అధికారులు స్పందించారు. ఆలూరు–ఎల్లార్తి రోడ్డు సమీపంలో ఉన్న వసతి గృహాలను సోమవారం ఏఎస్బిడబ్ల్యూఓ శ్రీనివాసులు తనిఖీ చేశారు. వసతి గృహాలను తెరిపించి విద్యార్థులు అందులో చేర్చించి వారితో ఏఎస్బిడబ్ల్యూఓ మాట్లాడారు. హెచ్డబ్ల్యూఓలు బదిలీలతో వసతి గృహాల ప్రారంభం కాస్త ఆల్యమైయిందన్నారు. కళాశాల వసతి గృహానికి అనిమిరెడ్డి, బీసీ బాలు వసతి గృహానికి బదిలీపై వెళ్లిన సంపత్కుమార్ ఇన్ చార్జ్హెచ్ డబ్ల్యూఓగా విధులను నిర్వహిస్తారన్నారు. ఇక నుంచి విద్యార్థులకు అసౌకార్యలను కల్పించకుండా అన్ని సదుపాయాలను కల్పిస్తామన్నారు.

తలుపులు తెరుచుకున్న వసతి గృహాలు