
టీడీపీ నాయకుడిపై చర్యలు తీసుకోండి
డోన్ టౌన్: ప్రభుత్వ స్థలాలు అక్రమించి ఇతరుల పేర్ల మీద రికార్డులు తయారు చేసి కోర్టులను తప్పుదోవ పట్టిస్తున్న టీడీపీ నాయకుడు, వ్యవసాయ మార్కెట్యార్డ్ మాజీ చైర్మన్ మురళీకృష్ణగౌడ్ౖపై చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాల నాయకులు అధికారులను కోరుతున్నారు. సోమవారం ప్రజా పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యవర్గ సభ్యులు ధర్మారం రంగనాయకులు ఆధ్వర్యంలో ఆర్డీఓ నరసింహులను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఐటీఐ వద్ద ఉన్న ప్రభుత్వ భూములు, వంక పోరంబోకు స్థలాలను ఆక్రమించి, అదే స్థలాన్ని తన సొంత స్థలంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నిర్మాణం కోసం విరాళంగా ఇచ్చి దాతగా మార్కెట్యార్డు చైర్మన్ వ్యవహరించారన్నారు. రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు చూస్తూ ఊరుకున్నారని వీరిపై జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశామన్నారు. అధికార పార్టీ నేత కావడంతో చర్యలు తీసుకోవడంలో అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆర్డీఓకు వివరించారు. వినతి పత్రం అందించిన వారిలో ఐఎఫ్టీయూ నాయకులు రేషు, రంగస్వామి, రాముడు, హరి, సుధాకర్, రామనాయుడు తదితరులు ఉన్నారు.
కొనసాగుతున్న పాలిసెట్ కౌన్సెలింగ్
కర్నూలు సిటీ: పాలిటెక్నిక్ డిప్లమా కోర్సుల కౌన్సెలింగ్ కొనసాగుతోంది. జి.పుల్లారెడ్డి ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో ఏర్పాటు హెల్ప్ డెస్క్ సెంటర్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరుగుతోంది. రెండో రోజు సోమవారం మొత్తం 200 మంది విద్యార్థుల సర్టిఫికెట్లను వెరిఫై చేసి, విద్యార్థులకు రిజిస్ట్రేషన్ కమ్ వెరిఫికేషన్ సర్టిఫికెట్లను అందజేశారు. హెల్ప్లైన్ సెంటర్ కో–ఆర్డినేటర్ డాక్టర్ ఎం.వి.ఎస్.ఎస్.ఎన్ ప్రసాద్, చీఫ్ వెరిఫికేషన్ ఆఫీసర్ రామకృష్ణయ్య కౌన్సెలింగ్ ప్రక్రియను పరిశీలించారు. వెరిఫికేషన్కు హాజరైన విద్యార్థులు ఈ నెల 25వ తేదీ నుంచి ఆన్లైన్లో వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవచ్చునని కో–ఆర్డినేటర్ తెలిపారు.
నిరుపయోగం
మద్దికెర: స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఏడేళ్ల క్రితం ఆర్ఎంఎస్యూ ఫేస్ –3 నిధులతో అదనపు గదులు నిర్మించారు. ఇంతవరకు వాటిని ఉపయోగించుకోకపోవడంతో నిరుపయోగంగా మారాయి. లక్షలాది రూపాయలతో నిర్మించిన గదులు ఎలాంటి ఉపయోగం లేకుండా శిథిలావస్థకు చేరుతుండడంతో ప్రజాధనం వృథా అవుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

టీడీపీ నాయకుడిపై చర్యలు తీసుకోండి