
విద్యార్థులకు ఉప్పు నీరే దిక్కు
పత్తికొండ: పట్టణంలోని ప్రభుత్వ బాలుర పాఠశాల విద్యార్థులు ఉప్పు నీరు తాగి దాహం తీర్చుకుంటున్నారు. పాఠశాలలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆర్ఆర్ ప్లాంట్ను ఏర్పాటు చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ ప్లాంట్ను పట్టించుకోవడం లేదు. దీంతో బడిలో చదువుతున్న విద్యార్థులకు నీటి కష్టాలు తప్పడం లేదు. బాలుర ఉన్నత పాఠశాలలో 900 మంది చదువుకుంటున్నారు. మామూలు సమయంతో పాటు మధ్యాహ్నం భోజనం అనంతరం విద్యార్థులు ఉప్పునీరు తాగుతూ రోగాలు బారిన పడుతున్నారని తల్లితండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి విద్యార్థులకు మంచినీరు అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

విద్యార్థులకు ఉప్పు నీరే దిక్కు