
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
బేతంచెర్ల: ఆర్ఎస్ రంగాపురం గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గ్రామానికి చెందిన గూటుపల్లె విజ య్, తెలుగు మహేష్ ఆదివారం అర్ధరాత్రి బైక్పై ప్రధాన రహదారిపైకి వస్తుండగా మద్దిలేటి స్వామి ఆలయ ముఖ ద్వారం వద్ద అదే సమయంలో బేతంచెర్ల వైపు నుంచి డోన్ వైపు వెళ్తున్న బొలొరే వాహనం ప్రమాదవశాత్తు ఢీ కొట్టింది. ఈ సంఘటనలో తీవ్రగాయాల పాలైన గూటుపల్లె విజయ్(25) అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రగాయాల పాలైన తెలుగు మహేష్ను మెరు గైన వైద్యం కోసం కర్నూలుకు తరలించారు. మృతుడు మహేష్కు భార్య పవిత్ర ఉంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు సోమవారం తెలిపారు. కాగా అదే ప్రాంతంలో కారు, బైక్ ఢీకొన్న ప్రమాదంలో మరో ఇద్దరు గాయపడ్డారు. ప్రమా దాలు జరిగే అవకాశం ఉన్న ఈ ప్రాంతంలో స్పీడ్ బ్రేకర్లు వేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.
పొలం రస్తా తగాదా.. రైతు ఆత్మహత్య
ఆలూరు రూరల్: పొలం రస్తా విషయంలో పక్కన పొలానికి చెందిన వెంకటేష్ అనే వ్యక్తితో గొడవ పడి గోపాల్ (43) అనే రైతు పురుగుల మందుతాగి ఆత్మహ్యత చేసుకున్నాడు. మండలంలోని హులేబీడు గ్రామంలో ఆదివారం రాత్రి ఘటన చోటుచేసుకుంది. ఎస్ఐ మహబూబ్ తెలిపిన వివరాలు.. పొలం రస్తా విషయంలో హులేబీడు గ్రామానికి చెందిన వెంకటేష్తో గోపాల్కు కొన్ని రోజుల నుంచి తగాదాలు ఉన్నాయి. ఆదివారం సాయంత్రం వెంకటేష్తో గోపాల్ గొడవపడ్డాడు. రస్తా విషయం ఎప్పటికీ తెగదని మనస్తాపానికి గురైన గోపాల్ (43) ఆదివారం రాత్రి పురుగుల మంది తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన బంధువులు ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిచారు. వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు మెరుగైన వైద్యం కోసం ఆదోని ఏరియా ఆసుపత్రికి రెఫర్ చేశారు. 108 అంబులెన్సులో తరలిస్తుండగా గోపాల్ కోలుకోలేక మృతిచెందాడు. మృతుడి భార్య తాయమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మహబూబ్ బాషా విలేకరులకు తెలిపారు.