
ఘనంగా శివపార్వతుల కల్యాణం
బనగానపల్లె రూరల్: యాగంటి క్షేత్రంలోని ఉమా మహేశ్వరస్వామి ఆలయంలో సోమవారం మాసశివరాత్రి సందర్భంగా స్వామి వారి కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆధ్వర్యంలో ఆలయంలో ఏకశిలా రూపంలో కొలువైన
పుస్తకపాణిగా కొలనుభారతి దేవి
కొత్తపల్లి: శివపురం గ్రామం సమీపంలో నల్లమల అటవీ ప్రాంతంలో వెలసిన కొలనుభారతి దేవి పుణ్యక్షేత్రంలో సరస్వతీ దేవి అమ్మవారు పుస్తకపాణిగా భక్తులకు దర్శమిచ్చారు. బహుళ త్రయోదశి సోమవారం అమ్మవారు భక్తుల ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు శ్రీనివాసశర్మ అమ్మవారికి కుంకుమార్చన, పుష్పార్చన, బిల్వార్చన, అభిషేకం, మంగళహారతి వంటి విశేష పూజలు చేశారు. సోమవారం కావడంతో భక్తులు అమ్మవారిని సుదూర ప్రాంతాల నుంచి వచ్చి, వారి చిన్నారులకు అక్షరాభ్యాసాలు చేయించుకున్నారు.
తప్పుడు సమాచారంతో ఆర్టీఐ చట్టానికి తూట్లు
కర్నూలు(సెంట్రల్): తప్పుడు సమాచారంతో దేవనకొండ తహసీల్దార్ కార్యాలయంలో సమాచార హక్కు చట్టానికి తూట్లు పొడుస్తున్నారని రాయలసీమ యువజన పోరాట సమితి అధ్యక్షుడు వీవీనాయుడు ఆరోపించారు. సోమవారం ఏక్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దేవనకొండ తహశీల్దార్ కార్యాలయంలో ఏదైనా సమాచారం కోసం దరఖాస్తు చేసుకుంటే అధికారులు లేనిపోని ప్రశ్నలు సంధించి ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. ఇటీవల తాను గుండ్లకొండ రెవెన్యూపరిధిలోని సర్వే నంబర్ 772లోని భూములకు సంబంధించిన పత్రాల కోసం దరఖాస్తు చేశానని, ఆలస్యంగా సర్వే నంబర్ 777 సర్వే సమాచారం ఇచ్చారన్నారు. దీనిపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు.

ఘనంగా శివపార్వతుల కల్యాణం