No Headline | - | Sakshi
Sakshi News home page

No Headline

Mar 8 2025 1:49 AM | Updated on Mar 8 2025 1:45 AM

అలుపెరగని అమ్మ

పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. తమ అమేయ శక్తితో అద్భుతాలను సృష్టిస్తున్నారు. కుటుంబానికి అండగా ఉంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు. కర్నూలు బుధవారపేటకు చెందిన కాతున్‌బీ తొమ్మిది పదుల వయస్సుల్లోనూ బీపీ, షుగర్‌ వంటి ఏ రోగాలు లేకుండా ఆరోగ్యంగా ఉన్నారు. ఈమెకు ఐదుగురు కుమార్తెలు, ఆరుగురు కుమారులు ఉన్నా.. ఇంటి పని చేస్తున్నారు. గొడ్డలితో కట్టెలను కొడుతూ ఔరా అనిపిస్తున్నారు. కర్నూలు పూలబజార్‌లో 80 ఏళ్ల వయస్సు కలిగిన నాగమ్మ.. పెరుగు అమ్మకాలు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. కర్నూలు నగరంలోని నంద్యాల చెక్‌పోస్టు సమీపంలో 60 సంవత్సరాల వయస్సు ఉన్న ఐలమ్మ.. చెప్పులు కుడుతూ కుటుంబానికి అండగా ఉన్నారు. కర్నూలు సి.క్యాంప్‌ సమీపంలో రోళ్లు మలుస్తూ సౌమ్య అనే మహిళ.. కర్నూలు నగరం మద్దూర్‌నగర్‌లో చేపల వ్యాపారం చేస్తున్న వరలక్ష్మి.. వీరే కాదు ఇంకా ఎంతో మంది వివిధ పనులు చేస్తూ ప్రతి ఒక్కరిలో జీవనోత్సహాన్ని నింపుతున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్‌, కర్నూలు

12న ఫీజు పోరును విజయవంతం చేద్దాం..

ఈనెల 12వ తేదీన వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నిర్వహించే ఫీజు పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని కాటసాని పిలుపు నిచ్చారు. నంద్యాల జిల్లా ఉదయానంద హోటల్‌ నుంచి జిల్లా కలెక్టర్‌ కార్యాలయం వరకు విద్యార్థులతో కలసి ర్యాలీ ఉంటుందన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం అందిస్తామన్నారు. ర్యాలీకి జిల్లాలోని నియోజకవర్గాల నుంచి విద్యార్థులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు భారీగా తరలిరావాలన్నారు. అలాగే 12న వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఉదయం కల్లూరు అర్బన్‌ శరీన్‌నగర్‌లోని దివంగత నేత వైఎస్‌ఆర్‌ విగ్రహం దగ్గర పార్టీ ఆవిర్భావ వేడుకలు నిర్వహిస్తామన్నారు.

No Headline1
1/5

No Headline

No Headline2
2/5

No Headline

No Headline3
3/5

No Headline

No Headline4
4/5

No Headline

No Headline5
5/5

No Headline

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement