
వేల్స్లో లక్ష్మీనరసింహుడి కల్యాణోత్సవం
యాదగిరిగుట్ట రూరల్: యునైటెడ్ కింగ్డమ్లోని వేల్స్ రాజధాని కార్డిఫ్ నగరంలో లక్ష్మీనరసింహస్వామి కల్యాణాన్ని ఆదివారం వైభవంగా నిర్వహించారు. యునైటెడ్ కింగ్డమ్ కార్డిఫ్ హిందూ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కల్యాణోత్సవంలో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ అనువంశిక ధర్మకర్త బి. నరసింహమూర్తి, అర్చకులు కిరణ్కుమార్చార్యులు, దోర్బాల భాస్కర్శర్మ బృందం పాల్గొన్నారు. ఈ కల్యాణోత్సవంలో డాక్టర్ వెలగపూడి బాపూజీరావు, అన్నపూర్ణ శ్రీనివాస్, భక్తులు పాల్గొన్నారు.