ఎస్పీబీ అందరి హృదయాల్లో చిరంజీవిగా ఉంటారు: వైఎస్‌ జగన్‌ | Ys Jagan Pays Tribue To Sp Balasubrahmanyam On His Death Anniversary | Sakshi
Sakshi News home page

SP Balasubrahmanyam: ఎస్పీ బాలుకు వైఎస్‌ జగన్‌ నివాళులు

Sep 25 2021 2:47 PM | Updated on Sep 25 2021 3:19 PM

Ys Jagan Pays Tribue To Sp Balasubrahmanyam On His Death Anniversary - Sakshi

గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఈ లోకాన్ని వదిలి అప్పుడే ఏడాది కావస్తోంది. తన స్వర మాధుర్యంతో ఆబాలగోపాలాన్ని ఉర్రూతలూగించిన ఆ గొంతు మూగబోయిందనే విషయాన్ని జీర్ణించుకోవడం ఇంకా కష్టంగానే ఉంది. ఎస్పీ బాలు వర్థంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆయనకు నివాళులు అర్పించారు.

'మధుర గాయకులు, స్వరకర్త ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళి. తన గాత్రంతో తెలుగు వారినే కాదు ఎన్నో భాషల్లో అశేష సంగీతాభిమానులను సంపాదించుకున్న ఎస్పీబీ అందరి హృదయాల్లో చిరంజీవిగా ఉంటారు' అంటూ ఆయన ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. కాగా గతేడాది సెప్టెంబర్‌ 25న ఎస్పీ బాలు హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement